23-12-2025 12:00:00 AM
నిజామాబాద్ డిసెంబర్ 22 (విజయ క్రాంతి) : గత నెల రోజులు మొదలుకొని డిసెంబర్ 21 తేదీ వరకు జరిగిన స్పెషల్ జాతీయ మెగా లోక్ అదాలత్ లో భాగంగా , జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన , రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి ,చాలా కాలంగా అపరిస్కృతంగా ఉన్న ఐ.పి.సి, బి ఎన్ ఎస్= 314 కేసులు,సైబర్ క్రైమ్ = 62 కేసులు, ఇ- పెట్టి = 1409 కేసులు డి.డి , ఎం.వి యాక్ట్ = 1013, మొత్తం = 2798 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరించి పరిష్కారం చేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి బాస్వ రెడ్డి మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం చేసినందుకు, సైబర్ క్రైమ్ సిబ్బంది,కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అభినందించారు.
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి జాతీయ మెగా లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, టి ఎస్ సి ఎస్ బి [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఐపిఎస్. ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డి4సి ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యాయవేక్షించడం జరుగుతుందన్నారు.
నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ స్పెషల్ లోక్ అదాలత్ నందు 62 సైబర్ క్రైమ్ కేసులలో 14,81,348-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ప ఏసిపివై. వెంకటేశ్వర్ రావ్ , సి ఐ ముఖిద్ పాషా , సి సి ఆర్ బి సి ఐ రమేష్ , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వా రెడ్డి అభినందించారు.