18 April, 2026 | 10:04 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రైతుకు గౌరవం పెరిగింది

22-04-2025 12:00 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 గోదావరిఖని, ఏప్రిల్21 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని, సమాజంలో రైతులకు కూడా గౌరవం పెరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. జనగామ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి కటింగ్ లు లేకుండా వడ్ల కొనుగోలు కు పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి ప్రస్తుతం నాలుగో సారి కటింగ్లు లేకుండా కొనుగోలు జరుగుతున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో జనగామ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందారని, త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, .కాంగ్రేస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.