12-02-2025 01:45:10 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: బ్రిటన్ కూడా అమెరికా బాటలోనే పయనిస్తూ అక్రమవలసదారుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. బ్రిటన్ అధికారులు ఇండియన్ రెస్టారెంట్లపై మెరుపుదాడులు చేస్తున్నారు. అలాగే కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై సోదాలు నిర్వహించి అక్రమవలసదారుల ను అరెస్ట్ చేస్తున్నారు.
ఉత్తర ఇంగ్లాండ్లోని హంబర్సైడ్లో ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్లో సోదాలు నిర్వహించిన ఇమ్మిగ్రేషన్ అ ధికారులు ఏడుగురుని అరెస్ట్ చేశారని.. మ రో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు బ్రిటన్ హోంశాఖ వెల్లడించింది. సౌత్ లండలోని ఓ భారతీయ గ్రాసరీ వేర్హౌస్లో అధికారులు తనిఖీలు జరిపి ఆరు గురిని అరెస్ట్ చేసినట్టు హోంశాఖ పేర్కొంది.
జనవరిలో బ్రిటన్ వ్యాప్తంగా 828 ప్రాంతా ల్లో సోదాలు నిర్వహించి 609 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టు తెలిపి ంది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 19వేల మంది అక్రమవలసదారుల ను దేశం నుంచి బహిష్కరించినట్టు పేర్కొం ది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానం ద్వారా వారిని దేశం నుంచి బయటకు పంపిస్తున్న దృశ్యాలను హోంశాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది.