12 March, 2026 | 6:48 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రైతులను విస్మరిస్తున్న రేవంత్ ప్రభుత్వం: కట్ట మల్లేష్

12-03-2026 04:53 PM

వేములపల్లి, విజయక్రాంతి: ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 28 నెలలు కావస్తున్నప్పటికీ రైతు భరోసా ఒక్క సీజన్లో మాత్రమే వేశాడు. మిగతా నాలుగు సీజన్లకు రైతులను మభ్యపెడుతూనే ఉన్నాడు.

కెసిఆర్ పాలించిన పది ఏండ్లలో రైతాంగానికి పెద్దపీట వేసి రైతు భరోసా ప్రతి సీజన్ కి అందించి రైతుల ఎదుగుదల పట్ల పెద్దన్న పాత్ర పోషించాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాని కనుమరుగయ్యేలా పావులు కదుపుతుండడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అదేవిధంగా యూరియాని సైతం పంటకు సకాలంలో వేయకుండా మాయదారి యాప్ను తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను విస్మరించకుండా అందించాల్సిన రైతు భరోసా యూరియా సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించకపోతే రైతు ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.