calender_icon.png 15 June, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి.. బీజేపీ ఏజెంట్

14-06-2025 07:24:23 PM

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్...

కరీంనగర్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బిజెపి ఏజెంట్ అని, ఏడాది కాలంలో రాహుల్ గాంధీ కంటే మోదీనే ఎక్కువ సార్లు ఢిల్లీలో రేవంత్ రెడ్డి కలిశారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్(Former MLA Sunke Ravi Shankar) అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ నేతలందరినీ కలుస్తూ రేవంత్ రెడ్డిని మాత్రం రాహుల్ గాంధీ దూరం పెడుతున్నారని అన్నారు. ఒంటరిగా రేవంత్ రెడ్డిని రాహుల్ నేరుగా కలిసి సంవత్సరం దాటిందని ఢిల్లీ కాంగ్రెస్ అంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించాడనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై అపనమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంది అన్నారు. రాహుల్, సోనియా గాంధీల నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసుపై ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పెదవి విప్పలేదన్నారు. ఇప్పటికిప్పుడు సీఎంను మారిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని వేచి చూసే ధోరణిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందన్నారు.