calender_icon.png 27 June, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదే

27-06-2025 12:37:13 AM

ఏఐసీసీ కార్యదర్శి విష్ణు నాథన్ 

కామారెడ్డి, జూన్ 26 (విజయ క్రాంతి), దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఏఐసీసీ కార్యదర్శి విష్ణు నాథన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి లో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ సంస్థ గత ఎన్నికల పై కార్యకర్తల ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయన్నారు. ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రం దేశంలోని రూరల్ మోడల్ గా చేస్తా అన్నారు చేయలేదు అని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణాలు చేశారని సోనియాగాంధీ నాయకత్వంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఆహార భద్రత కార్డు తీసుకోవచ్చి పేదలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు.  దేశవ్యాప్తంగా 71 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. చేనేత కార్మికులకు దేశవ్యాప్తంగా 5000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు.

బిజెపి ప్రభుత్వంలో రైతులపై నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీశారు అన్నారు. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి అధికారం రావడం తప్ప ప్రజలకు తేలుతుంది బిజెపి ప్రభుత్వం ఏమి లేదన్నారు. అన్ని గమనించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజు కుని అధికారంలోకి వస్తుందన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం గ్రామ గ్రామాన వాడవాడల కాంగ్రెస్ తీసుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా ప్రజల్లోకి తీసుకపోవాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శిబిరాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా అందించి రికార్డు సాధించిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ ప్రభుత్వంది అని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న మన్నారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో కమిషన్లు తిన్నారని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్  మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు ఐక్యతగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

ఈ సమావేశంలో అబ్జర్వర్లు కత్తి వెంకటస్వామి, సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాచారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నౌ శిలాల్, పల్లె రమేష్ గౌడ్, గణేష్ రాథోడ్, మద్దికుంట నర్సా గౌడ్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్, బిబిపేట్, రాజంపేట మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.