30 May, 2026 | 7:17 PM

Breaking News

బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •   వరి కొయ్యలకు నిప్పు పర్యావరణానికి ముప్పు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్ అంకిత్   •   కార్మికుల అసంఘటిత రంగాల కార్మికులకు సిఐటియు అండదండ   •  

ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు చేరాలి -ఎమ్మెల్యే జారె

05-04-2026 01:06 PM

దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ప్రతి శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా గృహనిర్మాణాలతో పాటు ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమయానికి చేరేలా అధికారులు కృషి చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.  నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.