calender_icon.png 9 February, 2026 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలిన

09-02-2026 12:00:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న తీరును పర్యవేక్షించారు. బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్ పూర్తున తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణీందర్, మున్సిపల్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.