టెన్త్లో రిషి విజయభేరి
01-05-2026 12:00 AM
మహబూబ్నగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేం ద్రంలోని రిషి పాఠశాల విద్యార్థులు విజయభేరీ మోగించారు. ఈ మేరకు పాఠశాలకు చెందిన విద్యార్థులు కార్తికేయరెడ్డి 594, శ్రీకర్ 586, దివ్యశ్రీ 582, జశ్వంత్ 580, సాయికీర్తన 580 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రకళావెంకట్, డైరెక్టర్లు పూజిత మోహన్ రెడ్డి, శిరీష, ప్రవీణ్కుమార్, సుశాంత్ రెడ్డి, ఇన్చార్జి మాలతి తదితరులు పాల్గొన్నారు.






