27-06-2025 02:19:24 AM
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, అక్కడికక్కడే ఎస్ఐ, కానిస్టేబుల్ మృతి
కోదాడ జూన్ 26 : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్ లోని దుర్గాపురం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్త్స్రతో సహా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివ రాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఎస్త్స్ర అశోక్ తన నలుగురు సిబ్బందితో కలిసి ఓ కేసు విషయమై అర్ధరాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు.
ఈ క్రమంలో కోదాడ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారు నుజు నుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ అశోక్,కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది..