27-06-2025 02:18:29 AM
- చెప్పుడు మాటలు విని ఆందోళన చెందవద్దు
- ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
చారకొండ జూన్ 26 : హైకోర్టు ఉత్తర్వులతో ఇల్లు కో ల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్థలం లో ఇందిరమ్మ ఇల్లు కట్టిం చి ఇస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నా రు. గురువారం మండలంలోని శిరుసనగండ్ల పరిధిలోని అయోధ్య నగర్ లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను కోర్టు ఉత్తర్వులతో కూల్చివేయడంతో గురువారం నిర్వాసితులను ఎమ్మెల్యే పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 సంవత్సరంలో ఎండోమెంట్ అధికారులు అక్రమ కట్టడాలపై కోర్టుకు వెళ్లారని 2014లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇండ్ల కూల్చివేతను ప్ర భుత్వం చేయించిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించడం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సమస్యను పట్టించుకోకుండా ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదన్నారు.
కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా తాను ని ర్వాసితులు, ఆలయ అర్చకులతో మాట్లాడి కూల్చి వేయకుండా ప్రయత్నం చేశానని కానీ కొంతమంది రెచ్చగొట్టి కూల్చివేతల పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు.కూల్చివేతలో ఇండ్లు కో ల్పోయిన బాధితులందరికీ అయోధ్య నగర్ లోనే ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు 30 వరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారాలకు ఇబ్బంది లేకుం డా చూస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుల చెప్పుడు మాటలు నమ్మి ఆగం కావద్దన్నారు.
సర్వే నిర్వహించి స్థలాన్ని గుర్తించాలని స్థానిక తహసీల్దార్ సునీతకు సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, తాసిల్దార్ సునీత ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, విజయకుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్, ఉమామహేశ్వర చైర్మన్ మాధవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు భీముడు నాయక్, నర్సింహారెడ్డి , సురేందర్ రెడ్డి, వెంకటయ్య, జైపాల్, సందీప్ రెడ్డి రమేష్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.