రోడ్డు డ్రైనేజీ ఏర్పాటు చేయాలి
12-03-2026 02:57 PM
కార్పొరేటర్ మేయర్ ను కోరిన 47వ డివిజన్ ప్రజలు.
పాల్వంచ, (విజయక్రాంతి): ప్రజా పాలన సందర్భంగా -99 డేస్ యాక్షన్ ప్లాన్ సందర్భంగా భద్రాద్రికొత్తగూడెం మున్సిపల్(Bhadradri Kothagudem Municipal) మేయర్ మోడ్ గణేష్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, 47 వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు (జివిఆర్) పాత పాల్వంచ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసు కొన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాంబాగ్ చైర్మెన్ షేక్.రెహమాన్, కార్యదశి షేక్ గౌస్ పాషా, మొహమ్మద్ మస్తాన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




