17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హెల్మెట్‌ తప్పనిసరి – ప్రాణ రక్షణకు కీలకం

24-02-2026 08:55 PM

ఏఎస్పీ చిత్తరంజన్

వాంకిడి,(విజయక్రాంతి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహారంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగోషే పెంటు (బెండార గ్రామం) కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ద్విచక్ర వాహనదారులకు 25 హెల్మెట్లు పంపిణీ చేశారు.

అలాగే మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ... హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.