31-05-2025 02:55:05 AM
ఎలిమినేటర్లో గుజరాత్ ఓటమి
ముల్లన్పూర్, మే 30: ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. శుక్రవారం ముల్లన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (80) టాప్ స్కోరర్గా నిలిచాడు. బుమ్రా, బౌల్ట్, గ్లెసన్, సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. మ్యాచ్ గెలిచిన ముంబై జూన్ 1న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.