calender_icon.png 8 December, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిరోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

08-12-2025 04:23:41 PM

కత్తులతో పొడిచి, తుపాకితో కాల్చి కిరాతకంగా హతం..

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి కిరాతకంగా హతమార్చారు. స్థానికుల కథనం ప్రకారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరత్నం(46) అనే రౌడీషీటర్ స్కూటీపై వెళ్తుండగా వెంబడించి సాకేత్ కాలనీ పోస్టర్ బిల్లా బాంగ్ స్కూలు సమీపంలో దాడికి పాల్పడ్డారు.

కిరాతకంగా కత్తులతో దాడి చేయగా తల, మెడ, పొట్ట భాగాల్లో గాయాలై అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వెంకటరత్నం పై దూల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉంది. జంట హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. హత్యకు వ్యాపార ఆర్థిక లావాదేవీలే కారణమా? ఇంకా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలతో విచారణ చేస్తున్నామని మల్కాజిగిరి డిసిపి శ్రీధర్ తెలిపారు.