22-06-2025 12:35:18 AM
బై బ్యాక్ పాలసీ పేరుతో ఏవీ ఇన్ఫ్రాకాన్ మోసం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): ప్రజల అత్యాశ, అమాయక త్వాన్ని ఆసరాగా చేసుకుని ఏవీ ఇన్ఫ్రా కాన్ అనే సంస్థ భారీ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడింది. బై బ్యాక్ పాలసీ పేరుతో అనతి కాలంలోనే తమ పెట్టుబడి ఒకటికి రెండింతలు అవుతుందని నమ్మబలికి వందలాది మంది బాధితుల నుంచి సుమారు రూ.500 కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేసింది. మోసపోయామని గ్రహించిన బాధి తులు శనివారం సైబరాబాద్ కమిషనరేట్లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాల యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడకు చెందిన గోగుల లక్ష్మీవిజయ్ కుమార్ ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరుతో మాదాపూర్లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ వెంచర్లలో పెట్టుబడి పెడితే బై బ్యాక్ పాలసీ ద్వారా 18 నెలల్లోనే పెట్టిన డబ్బు ఒకటికి రెండింతలు తిరిగి చెల్లిస్తామని, అందుకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామని నమ్మించాడు. నిజమని నమ్మి న వందలాది మంది ప్రజలు రూ.10 లక్షల నుంచి కోట్లాది రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు.
తొలుత అనుకున్న ప్రకారం కొందరికి డబ్బులు చెల్లించి నమ్మకం కల్పించాడు. దీంతో సుమారు వెయ్యి మంది వర కు బాధితులు ‘ఏవీ ఇన్ఫ్రాకాన్’ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. వీరి నుంచి లక్ష్మీవిజయ్కుమార్ సుమారు రూ. 500 కోట్ల వరకు వసూలు చేసి, పరారైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.