22-06-2025 12:32:02 AM
‘పుష్ప చిత్రంలో దర్శకుడు సుకుమార్ ఏ ముహూర్తాన కథానాయకుడు అల్లు అర్జున్తో ‘రప్పా రప్పా నరుకుతా’ అనే డైలాగ్ అనిపించాడో తెలియదు గానీ.. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఆ డైలాగ్ ఫేమస్. తాజాగా ఏపీ మాజీ సీఎం వైస్ జగన్ ఇదే డైలాగ్ను ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు రెండడుగులు ముందుకేసి ఆ స్లోగన్తో ఏకంగా ‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా..రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ’ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిం చారు.
అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే ‘రప్పా.. రప్పా’ డైలాగ్ను ఎత్తుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శనివారం జరిగిన గులాబీ శ్రేణులు నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ‘2028లో రప్పా.. రప్పా...3.0 లోడింగ్’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరలయ్యాయి. ‘రప్పా.. రప్పా’ రాజకీయాలు ఇక పార్టీలను ఎటు వైపునకు నడిపిస్తాయో వేచి చూడాలి మరి.
రమేశ్ మోతె