24 April, 2026 | 12:13 PM

Breaking News

అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •  

సమయపాలన పాటించని ఆర్టీసీ బస్సులు

03-03-2025 01:52 AM

ఎల్లారెడ్డి, మార్చి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బస్టాండుకు ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించ డంలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఆదివారం సంతకావడంతో పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి బస్సుల కోసం ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆర్టీసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వారంత సంత ఉండటంతో ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణ కేంద్రానికి చేరుకొని తిరుగు ప్రయాణం కోసం ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వైపు, బాన్సువాడ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికు లు గంటల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడ్డారు.

సంతతో పాటు పెండ్లిల్లు కార్యక్రమాల కాదన పలు గ్రామాల ప్రజలు సమయానికి బస్సులు రాకపోవడంతో ఆర్టీసీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఒకేసారి వరుసగా 2,3 బస్సులు రావడం సరైన విధానం కాదని మండి పడ్డారు. 

ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డి నుండి నిత్యం వేలాదిమంది ప్రయాణించే బాన్సువాడ మెదక్ కామారెడ్డి ప్రాంతాలకు ప్రయాణించే వారికి సరైన సమయానికి బస్సుల సౌకర్యం కల్పించాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.