తనిష్క్ సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా రుక్మిణి వసంత్
ముంబై, ఏప్రిల్ 2026: పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో, టాటా సంస్థకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ సౌత్ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించింది. సౌత్ ఇండియాలో ప్రముఖ నటి రుక్మిణి వసంత్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. అక్షయ తృతీయ కోసం సహజ రత్నాల విభాగంలో తమ తాజా ఆభరణాలను రుక్మిణి వసంత్తో కలిసి ఆవిష్కరించింది.
ఈ అక్షయ తృతీయ నాడు ఆమెతో కలిసి 'హ్యూస్' కలెక్షన్ సరికొత్తగా ఆవిష్కరిస్తున్నట్టు తనిష్క్ ప్రకటించింది. విలక్షణమైనప్పటికీ, సరసమైన ఫైన్ జ్యువెలరీని కోరుకునే వారి కోసం రూపొందించబడిన కొత్త 'హ్యూస్' కలెక్షన్, బంగారంలో సమకాలీన రంగుల కథలను చాటిచెప్పే ఒక ప్రత్యేకమైన డిజైన్ శైలితో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ. 35,000గా నిర్ణయించారు.
పచ్చలు, నీలమణి, సిట్రిన్లు, టూర్మలైన్లు, టాంజనైట్లు వంటి సహజ రంగుల రత్నాలను జాగ్రత్తగా ఎంపిక చేసి, ప్రతి రాయిని దాని అద్భుతమైన రంగు, స్పష్టత, సహజ లక్షణాల కోసం నైపుణ్యంతో, కఠినమైన నాణ్యతా ప్రమాణాల ద్వారా ఎంపిక చేశారు. ఇది ఈ కలెక్షన్ కు అరుదైన మరియు ప్రామాణికమైన గుర్తింపును ఇస్తుంది. అదే సమయంలో ప్రతిరోజూ ధరించడానికి తగిన అందం, మన్నిక రెండింటినీ అందిస్తుంది. ఈ శ్రేణిలో ప్రత్యేక సందర్భాల కోసం స్టేట్మెంట్ నెక్ పీస్లు & గాజులతో పాటు, రోజువారీ సొగసు కోసం రూపొందించిన తేలికపాటి చెవిరింగులు, ఉంగరాలు , పెండెంట్ సెట్లు ఉన్నాయి.
కొత్త కలెక్షన్ గురించి టైటాన్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీమతి పెల్కి షెరింగ్ మాట్లాడుతూ దక్షిణాది యొక్క గొప్ప సౌందర్య వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన సహజ రత్నాలతో తాము సరికొత్త డిజైన్లను ఆవిష్కరించినట్టు తెలిపారు.
టైటాన్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ శ్రీమతి గరిమా మహేశ్వరి మాట్లాడుతూ ‘హ్యూస్’ కలెక్షన్లో రత్నం కేవలం అలంకరణ వస్తువుగా కాకుండా, డిజైన్కే ప్రారంభ బిందువుగా ఉంటుందన్నారు. తనిష్క్ తో భాగస్వామ్యం గురించి రుక్మిణి వసంత్ మాట్లాడుతూ “తనకు తెలిసినప్పటి నుంచీ తనిష్క్ తన జీవితంలో ఒక భాగంగా ఉందనీ, నమ్మకం, పనితనం, శాశ్వత సౌందర్యంతో తాను ఎల్లప్పుడూ ముడిపెట్టే పేరు అది. ఇప్పుడు ‘హ్యూస్’ ప్రచారానికి ముఖచిత్రంగా వారితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందన్నారు.




