28-05-2025 12:00:00 AM
ఘటనకు సంబంధించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలి
మీడియా సమావేశంలో వామపక్ష, హక్కుల సంఘాల నేతలు
ఖమ్మం, మే 27 (విజయక్రాంతి): మావోయిస్టు మృతదేహాలను చూసి పాలకులు భయపడుతున్నారని అందుకే నంబా ల కేశవరావు -సహా ఎనిమిది మంది మృతదేహాల ను అప్పగించలేదని వామపక్ష, ప్రజా హ క్కుల సంఘాల నేతలు ఆరోపించారు. శత్రు దేశాల సైనికులు యుద్ధంలో మరణిస్తే మృ తదేహాలను స్వదేశానికి అప్పగిస్తారని కానీ మావోయిస్టు మృతదేహాలను అప్పగించకుండా ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిం చిందన్నారు.
మంగళవారం ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష ప్ర జా హక్కుల సంఘాల నేతలు మాట్లాడుతూ ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని సైతం నిలబెట్టుకోలేదని ఆ రోపించారు. సజీవంగా పట్టుకుని అతి దగ్గర నుంచి కాల్చి చంపారని అందుకే మృతదేహాలను అప్పగించలేదని వారు తెలిపారు. దశా బ్దాల పాటు ప్రజల పక్షాన పోరాడిన వారి మృతదేహాల ముందు తప్పతాగి నాట్యం చేస్తున్నారని ఇదెక్కడి మానవత్వం అని ప్ర శ్నించారు.
కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్ ఘఢ్ హోంమంత్రి నారాయణపూర్ ఎసిపిపై కేసు లు నమోదు చేసి విచారణ జరిపి రాజ్యాంగ బద్దంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రా జ్యాంగంలోని ఆర్టికల్ 21ని పాలకులే ఉల్లంఘిస్తున్నారన్నారు. ఒక సైనిక అధికారి ఫోన్ చేస్తే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని స్వదేశంలో ప్రజల కోసం పోరాడుతున్న వారు శాంతి చర్చలకు సిద్దమంటే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
ఆదివాసీల మనుగడ పైన సుప్రీం కోర్టు స్పందించాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో శాంతి సమన్వ య కమిటీ సభ్యులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, సిపిఐ జాతీయ సమితి -సభ్యులు బా గం హేమంతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నానాగేశ్వరరావు, ప్రజాపంథా జిల్లా కా ర్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్,
ఎన్డి నా యకులు లక్ష్మి నారాయణ, సిసిఏ బాధ్యులు కాకి భాస్కర్, ఐవి రమణారావు, రవిమారు త్, విజయ్, చిర్రా రవి, వివిధ పక్షాల నేతలు ఎస్కె జానిమియా, యర్రాబాబు, కొండపర్తి గోవిందరావు, మాదినేని రమేష్, వై. విక్రం, ఝాన్సీ, ఎస్ కె ఖాసీం పాల్గొన్నారు.