28-05-2025 12:00:00 AM
ఖమ్మం, మే 27 (విజయక్రాంతి): సంజీవరెడ్డి భవన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం భారత తొలి ప్రధాని, స్వా తంత్య్ర పోరాట నాయకుడు పండిత్జీ జవహర్ లాల్ నెహ్రూ 61 వర్ధంతి ఘనంగా ని ర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రె స్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజి శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి లు మాట్లాడుతూభారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్య్ర పోరాట నాయకుడు. పండిత్జీ గా, చాచా నెహ్రూ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా.
భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. అని అదేవిధం గా భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక, నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నె హ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొ ల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక, వ్యవ సాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు.
వ్యాపార, ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సం స్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మై నింగ్, విద్యుత్, భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానాన్ని యోచించారు. నె హ్రూ భూ పునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువ లు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
కమ్యూనిటీ అభివృద్ది పధకాలకు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యాన్ని ఇనుమడించే వివిధ కు టీర పరిశ్రమలను విస్తరింపచేసారు. భారీ ఆ నకట్టలను, బహుళార్థ సార్ధక ప్రాజెక్ట్లు ప్రోత్సహించడం, నీ టిపారుదల సౌకర్యాల కల్పన, జలవవిద్యుత్ ఉత్పత్తితో పాటు, నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశ పెట్టారు. భారత దేశ బాలలు, యువకులు విద్యను అ భ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నె హ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, ఇండియ న్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్ర భుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అం దించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కా ర్యక్రమాలను, వేలాది పాఠశాలల నిర్మాణా న్ని పర్యవేక్షించారు.
అంతేకాక బాలలలో పో షకాహార లోప నివారణకై ఉచిత పాలు, ఆ హార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయో జన విద్యా కేంద్రాలు, వృత్తి, సాంకేతిక వి ద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు. కు ల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించుటకూ, స్త్రీల న్యాయపరమైన హక్కుల కోస మూ, సాంఘిక స్వతంత్రతకూ, హిందూ చ ట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది.
షెడ్యుల్ కులాలు, తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను, అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగా లు, విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి, ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారని ఆయన సేవలను కొనియాడారు.