12-06-2025 05:06:12 PM
సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలపై మోయలేని బోరం మోపుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్(CPM District Committee Member Dodda Ravikumar) ఆరోపించారు. గురువారం పెంచిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా పాల్వంచ పట్టణ పరిధిలో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా పాలన అంటూ ప్రజలపై భారాలు వేస్తారా అని ప్రశ్నించారు. పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రజలపై భారాలు మోపడమే ప్రజా పాలనా 20 శాతం చార్జీలు పెంచి ప్రజల జేబులు ఖాళీ చేయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగునా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని పక్కనపెట్టి ఆర్టీసీ చార్జీలు ఎలా పెంచడంపై సిపిఎం నాయకులు మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఇప్పుడు పురుషుల దగ్గర డబల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని, పెంచిన చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్ పట్టణ కార్యదర్శి పి తులసి రామ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి చిటికెన ముసలయ్య టౌన్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కే సత్య టౌన్ కమిటీ సభ్యులు బి కాంతి బి మాధవి పార్టీ సీనియర్ నాయకులు బాస నారాయణ తదితరులు పాల్గొన్నారు.