12-06-2025 05:10:53 PM
పెన్ పహాడ్: పల్లె దవాఖానా వైధ్యాదికారి డాక్టర్. హరిప్రసాద్ ని గ్రామస్తులు, అప్పటి ప్రజా ప్రతినిధుల అనుమతి లేకుండా డిఫ్యూటేషన్ పై వెళ్లడంతో అప్పటినుండి గ్రామస్తులకు వైద్య సేవలు నిలిచి పోయాయాని కోరుతూ అనంతారం వాసులు, యువత కలసి డిప్యూటీ డిఎంహెచ్వో, డిఐఏఓ కోటిరత్నం(DIAO Kotiratnam)కు వినతి పత్రం అందజేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామస్తులు కలసి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ కోసం వచ్చిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ కు ఫిర్యాదు చేశారు.
మండలంలో అతిపెద్ద జనాభా గల అనంతారంకు గత ప్రభుత్వంలో పల్లె దవఖాన సేవలో భాగంగా గ్రామ ప్రజలకు వైద్యసేవలు అందించడానికి ఎంఎల్హెచ్పిగా డాక్టర్. హరి ప్రసాద్ నియమించగా గత కొన్ని నెలలుగా సదరు డాక్టర్ మా గ్రామ ప్రజలు, పాలకుల తీర్మానం లేకుండా సూర్యాపేటలోని రాజీవ్ నగర్ పట్టణ దవాఖానాకు ఉన్నత అధికారుల పైరవీతో వెళ్ళాడని అప్పటినుంచి నేటి వరకు మా పల్లె దవాఖానాకే 'సుస్తీ' అయిందని సదరు ఎంఎల్హెచ్పి(MLHP) లేని కారణంగా మా గ్రామ ప్రజలు అనేక రోగాల బారినపడి సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అధిక మొత్తంలో ధనం వెచ్చించి నష్ట పోతున్నారని.. అంతేకాదు ANM పోస్ట్ ఖాళీ కొంతకాలం క్రితం పదవీ విరమణ పొంది ఆ పోస్ట్ ఖాళీగా ఉండడం.. పల్లె డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పల్లె దవాఖానకు సంబంధించిన MLHP డాక్టర్.హరిప్రసాద్ ను తిరిగి వెంటనే కేటాయించి గ్రామ ప్రజలు అనారోగ్య భారిన పడకుండా కాపాడలన్నారు.
అంతేకాకుండా పల్లె దవాఖానాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఎవరి అకౌంట్లో జమ అయ్యాయి.. 2024-25 కు సంబంధించిన జాస్ నిధులు దుర్వినియోగం అయ్యాయని.. ఈ నిధులపై పూర్తి విచారణ చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.