20-06-2025 10:47:41 PM
రూ.200.01 కోట్లు నిధుల జమ..
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): వానాకాలం సాగు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా జిల్లా రైతులకు మద్ధతు అందించేందుకు భారీగా నిధులు విడుదలయ్యాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. గురువారం నాటికి నిర్మల్ జిల్లాలో రైతుల ఖాతాల్లోకి రూ.200.01 కోట్ల నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT) పద్ధతిలో విజయవంతంగా జమ అయినట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో ఉన్న మొత్తం 1,86,400 మంది రైతుల్లో 1,70,114 మందికి ఈ పథకం ద్వారా నిధులు అందినట్లు తెలిపారు. మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే నిధులు జమ కాబోతున్నాయని చెప్పారు. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గే అవకాశం లభిస్తుందని, దీంతో పంటల సాగు పనులు వేగంగా ప్రారంభించగలుగుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. పంటలు పండించే ప్రతి రైతుకు చివరి గుంట భూమి వరకూ రైతు భరోసా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పంట ప్రారంభానికి ముందే నిధులు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.