20-06-2025 10:51:28 PM
లీలా లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్బంగా ప్లాంట్ గివింగ్ డే..
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల కేంద్రంతో పాటు అనాజిపురం ఉన్నత పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ చెట్ల తల్లి లీలమ్మకు జన్మదిన వేడుకలు సందర్బంగా ప్లాంట్ గివింగ్ డే(Plant Giving Day) కార్యక్రమం పిల్లలు వారి తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. 'చెట్ల తల్లి లీలమ్మ ఇవిగో అభివందనాలు' అంటూ విద్యార్థులు ఉత్సవంగా నినాదాలు చేశారు. ప్లాంట్స్ గివింగ్ డే సందర్బంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ జిల్లా కో ఆర్డినేటర్ మామిడి శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పండ్లను ఇచ్చే మొక్క తల్లికి, నీడను ఇచ్చే మొక్క తండ్రికి బహుమానంగా ఇచ్చే ముఖ్య ఉద్దేశ్యమే 'ప్లాంట్స్ గివ్వింగ్ డే ' ఉద్దేశ్యమన్నారు.
పర్యావనంలో భాగంగా ఈ కార్యమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వస్రాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్నో ఎన్జీవోలు పనిచేస్తున్నా పర్యావరణంపై పనిచేసే ఏకైక సంస్థ 'కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ' అని పచ్చదనం ప్రకృతి మీద ఎంత మక్కువ ఉన్నదో అమ్మ ఆచరణ, ఆలోచనలలోనే తెలుస్తుందని ప్రకృతి మీద ఇంత మమకారం ఉన్న లీలమ్మ పుట్టినరోజు సందర్భంగా అనాజీపురం పాఠశాలను దత్తతు తీసుకోవడం సంతోషకరమని.. పిల్లల తల్లిదండ్రులకు మొక్కలు బహుకరించి, నాటించడం మా అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమణి, సురేష్ కుమార్, భాస్కర్ రావు, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, ధర్మేష్, ఖాజ మొయినొద్దీన్, ఎస్ రామ్మోహన్ చారి, కే విజయ చందర్, సిజిఆర్ కో.ఆర్డినేటర్ మామిడి శంకర్, కత్తి కోటయ్య, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.