calender_icon.png 10 November, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఎంపీవోగా సైదా అర్జుమన్ భాను

10-11-2025 04:34:10 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం నూతన ఎంపీవోగా సైదా అర్జుమన్ భాను సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఎంపీఓకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ అలీ, రాధాకుమార్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.