17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్ డి డి ఎం పద్మావతి

10-11-2025 04:32 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామ పరిధిలో గల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ పద్మావతి పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు కేంద్రంలోని పత్తిని, ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు.

రైతులకు ఎకరాకు ఏడు క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చినట్లయితే ఏఈఓ వద్ద ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని అన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించిన వివరాలను కూడా ఏఈఓ దగ్గర నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సరిత, సిపిఓ సంతోష్ కుమార్, ఇన్చార్జి సెక్రెటరీ రమేష్, భాస్కర్ తదితరు పాల్గొన్నారు.