09-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 8(విజయక్రాంతి): మృగశిర కార్తె సందర్భంగా నిర్మల్ మండల సమైక్య ఆధ్వర్యంలో కొండాపూర్ నందు నిర్వహిస్తు న్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నందు సమీకృత వ్యవసాయం క్షేత్రం నందు ఆదివారం ఒక్క క్వింటాల్ కొర్రమీను చేపలను అమ్మడం జరిగిందని డీఆర్డిఓ విజయలక్ష్మి తెలిపారు.
చేప పిల్లల పెంపకం ద్వారా మహిళలకు ఆర్థిక వనరులను సమకూర్చడం జరుగుతుందని జిల్లాలో చేపట్టిన ఈ పథకం విజయవంతం అవుతుందన్నారు అదేవిధం గా భూసార పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మ న్ సోమ భీమరెడ్డి,ఆత్మ చైర్మన్ కె.రామ్రెడ్డి , ఆత్మ డైరెక్టర్ సురేష్, డిపిఎం విజయలక్ష్మి , ఏపీఎం అడ్డిగా భోసు, ఏపీవో రామకృష్ణ, హెచ్ ఆర్ మేనేజర్ సుధాకర్, నిర్మల్ సమైక్య కార్యదర్శి దండు లక్ష్మి, సీసీలు సంతోష్ నరసయ్య భోజన్న జ్యోతిర్మయి రేఖ, సిబ్బంది రవి సుజాత వెంకట్ పాల్గొన్నారు.