21-06-2025 02:19:26 AM
సూర్యాపేట, జూన్ 20 (విజయక్రాంతి) : అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సూర్యాపేట ప్రాజెక్ట్ పరిధిలోని అంగడి వాడి టీచర్స్ ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగడి వాడి టీచర్ ల కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్రము లోని బీజేపీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల పేరుతో అంగడి వాడి కేంద్రాలలో పని చేస్తున్న టీచర్లను, హెల్పర్లను కట్టు బానిసలుగా చూస్తూ,కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అంగడి వాడి కేంద్రాలకు పక్క భవనాలు నిర్మించాలని, పని భారం తగ్గించాలన్నారు. జులై 9న తేదీన జరుగు సార్వత్రిక సమ్మె లో అంగడి వాడి టీచర్స్, హెల్పర్స్ అందరు పాల్గొనాలనీ ఆయన పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశంలో అంగడి వాడి టీచర్స్, హెల్పర్స్ జిల్లా కార్యదర్శి బొలిశెట్టి భాస్కరమ్మ, మంజుల, లక్ష్మీ,సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు రణపంగి కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జె నర్సింహ రావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.