28-05-2025 12:00:00 AM
మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా
భద్రాద్రి కొత్తగూడెం, మే 27 (విజయక్రాంతి): జిల్లాలో పీసా యాక్ట్ ప్రకారం మహిళా సమాఖ్యల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటు, నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని మైనింగ్ శాఖ ఎండి భవిష్య మిశ్రా అ న్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో గిరిజన సమైక్యల ద్వారా ఇసుక ర్యాపుల ఏర్పాటు , నిర్వహణ కు తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐ టిడిఏ పి. ఓ రాహుల్ ములుగు ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రతో కలిసి టిజీ ఎం డి సి, ఐ టి డి ఏ, మైనింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భా గంగా ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక ర్యాం పుల వివరాలు, ప్రస్తుతం ఇసుక రాంపుల నిర్వహణలో చేపడుతున్న పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైనింగ్ శాఖ ఎండికి వివరించారు. అనంతరం మై నింగ్ శాఖ ఎండి భవేష్ మిశ్రా మాట్లాడు తూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపుల నిర్వహణ చేపట్టడం ద్వారా గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి జీవ నోపాధి పెంపొందిం చుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
గిరిజన మహిళా సంఘాల ద్వారా ఇ సుక ర్యాంపుల నిర్వహణ కు ఐటిడిఎ ద్వారా అవసరమైన వాహనాలు, యంత్ర పరికరాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. దీని ద్వారా గిరిజన మహిళా సమాఖ్యలకు మూడు రెట్ల అధిక ఆదాయం సమకూర్తుందన్నారు. ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఏజె న్సీ ప్రాంతమైన గిరిజనులకు ఐటీడీఏ, మై నింగ్ శాఖ అధికారులు సరైన అవగాహన క ల్పించాలన్నారు.
ఏర్పాటు చేసే ప్రతి ఇసుక రాంపులలో మహిళా సమాఖ్యలకు తోడ్పాటున అందించే విధంగా ఐటిడిఏ నుండి ఒక అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, ములుగు జిల్లాలో 3 ఇసుక ర్యాంపులు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చే యాలన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వారాల్లో ఇసుక ర్యాంపులకు ఏర్పాటుకు ఉత్సాహవంతులైన మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించాలన్నారు.
ముందుగా ప్రయోగాత్మకంగా ము లుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక ఇ సుక ర్యాంపును ప్రారంభించే విధంగా వా రికి శిక్షణ అందించాలని సూచించారు. గిరిజన మహిళలు సమర్థవంతంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ చేయడానికి అన్ని విధా ల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, భద్రాచ లం ఆర్డీవో దామోదర్ రావు, స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజాభి వృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయ క్, ఏడి మైన్స్ దినేష్ కుమార్ మరియు సం బంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.