calender_icon.png 7 June, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ముచేయకండి

28-05-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం ,మే 27 (విజయ క్రాంతి): పదవ తరగతిలో ఫెయిల్ అయిన గిరిజన విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు వినియోగించుకోకుండా మీకోసం పాటుపడు తున్న ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చే యకుండా తప్పనిసరిగా సప్లమెంటరీ పరీక్ష లు బాగా రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కా వాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహు ల్ కోరారు.

మంగళవారం  పాల్వంచలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు పదవ తరగతి స ప్లిమెంట్ పరీక్షలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కొన్ని సూచనలు ఇ స్తూ క్రీడలలో పాల్గొన్నప్పుడు గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా గెలుపు కో సం శతవిధాలా ప్రయత్నించాలని ఆ విధంగానే పదవ తరగతిలో ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలను శ్రద్ధతో విని పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులు కావాలని అన్నారు.

ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో వాటికి సంబంధించిన సబ్జెక్ట్ టీచర్లను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఫెయిల్ అయిపోయామని ఆలోచన మనసులో పెట్టుకోకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా క్లాసులకు అటెండ్ అయ్యి ఉపాధ్యాయుల బోధిస్తున్న తీరును పరిశీలించి పరీక్షల తేదీ నాటికి పరీక్షలు కాన్పుడెన్స్ గా రాస్తామని దృక్పథంతో సన్నద్ధం కావాలని అన్నారు.

సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులకు బోధిస్తున్న తరగతులను ఆయన పరి శీలించి విద్యార్థులు ఏ సబ్జెక్టులలో ఫెయిల్ అయినారో ఆ సబ్జెక్టులకు సంబంధించిన పూర్తి ఇతివృత్తాలను అంశాలను విద్యార్థు లు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలిం చి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన టాయిలెట్, మరుగుదొడ్లు కరెంటు కనెక్షన్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ , పాఠశాల హెచ్‌ఎం బద్రు, వా ర్డెన్ ప్రమోద్, తెలుగు ఇంగ్లీష్ గణితం, సా మాన్య, సాంఘిక శాస్త్రం సంబంధించిన సబ్జెక్టు టీచర్లు పాల్గొన్నారు.