calender_icon.png 30 May, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కై వారియర్స్‌గా సంగారెడ్డి మహిళలు

29-05-2025 12:52:33 AM

జిల్లాలో 52 మంది స్కై వారియర్స్, మహిళా శక్తిని గుర్తించిన ప్రధాని

డ్రోన్ శిక్షణతో ఉపాధి మార్గాలు : జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, మే 28(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లా మహిళలను స్కై వారియర్స్గా గుర్తించడం చాలా ప్రోత్సాహంగా ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.

కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఇందిరా మహిళా శక్తి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 33 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 28 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు అర్హత సాధించారన్నారు.

అర్హత సాధించిన డ్రైవింగ్ మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎయిర్ పోర్టులో, కంపెనీలలో, సర్వీస్ టాక్సీ లలో, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ మహిళ అభివృద్ధి సంస్థను ఆదేశించారు.  నమో దీదీ డ్రోన్ పథకం ద్వారా డ్రోన్ ట్రైనింగ్ పూర్తిచేసిన 52 మందినీ స్కై వారియర్స్ గుర్తించబడి అనేక ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు.

డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు మహిళ గ్రూపుల్లో సబ్సిడీ పైన డ్రోన్ అందించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.   డ్రోన్ ద్వారా మందులు పిచికారి చేయడంతో సమయము ,డబ్బు, నీరు ఆదా అవుతాయని, డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు నెలకు దాదాపు పదివేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఏ జ్యోతి, అదనపు డిఆర్డిఏ జంగారెడ్డి, ఎస్హెచ్జీ గ్రూప్ మహిళలు పాల్గొన్నారు.