15 April, 2026 | 12:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముగిసిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్

29-05-2025 12:50 AM

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ 

మునిపల్లి, మే 28 :  మండలంలోని పెద్ద గోపులారం గ్రామంలో గత నెల 23వ తేదీ నుంచి నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడా  పోటీలు బుధవారం నాడు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్, సౌత్ ఇండియా రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

అనంతరం క్రీడాల్లో విన్నర్ గా బుదేరా జట్టు, రన్నర్ గా పెద్దగోపులారం టీంకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శైలజ, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మనతోరి శశికుమార్, మర్పల్లి మాజీ జడ్పిటిసి మధు, మాజీ సర్పంచులు కీర్తికుమారి, రమేష్,  శంకర్, శ్రీను పటేల్, నాయకులు ఆనంద్, బాగన్న, కార్తీక్, విట్టల్, అంజి, మహేందర్, రాజు, శేఖర్, శివకుమార్, అప్సర్, హఫీస్ పాల్గొన్నారు.