గ్రామాల్లో పారిశుధ్యం పటిష్టంగా నిర్వహించాలి
07-05-2026 03:50 PM
డిఎల్పిఓ లింగయ్య
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గ్రామాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని నిర్మల్ డి ఎల్ పి ఓ లింగయ్య హెచ్చరించారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందిన ఫిర్యాదుకు స్పందించి డి ఎల్ పి ఓ గురువారం గోసంపల్లి, దిలావర్పూర్ గ్రామాలలో పరిశుద్ధ పనులను పర్యవేక్షించారు. మురికి కాలువల నిర్వహణ, నర్సరీల పర్యవేక్షణ సరిగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు ఎంపీవో సిహెచ్ రత్నాకర్ రావు తదితరులు ఉన్నారు.






