27 February, 2026 | 2:43 PM

భద్రాచలంలో సంత్ సేవాలాల్ జయంతి

27-02-2026 12:51 AM

భద్రాచలం, ఫిబ్రవరి 26,  (విజయక్రాంతి): బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి, రాహుల్ మరియు భద్రాచలం శాసనసభ్యులు

తెల్లం వెంకట్రావు సమక్షంలో ఈనెల 28వ తేదీ శనివారం రోజున ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సంత్ సేవాలాల్ కమిటీ సభ్యులు మోహన్లాల్ భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు మరియు ముఖ్యంగా బంజారా సోదరులు గిరిజన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు గిరిజన ఉద్యోగులు, బంజారా జాతి పెద్దలు, యువతీ యువకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.