calender_icon.png 23 July, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సప్తమి వేడుకలు

22-07-2025 05:38:39 PM

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని పార్డి(బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వారం రోజులుగా కొనసాగుతున్న సప్తమి వేడుకలు మంగళవారం పల్లకి ఊరేగింపు, అన్నదానంతో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(MLA Pawar Rama Rao Patel) పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలను అనాదిగా జరుపుకుంటూ ప్రతి ఇంటికి కనీసం ఒక్కరిదైనా శివుని పేరు పెట్టుకోవడం గ్రామంలో ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పార్డి(బీ) నిలిచిపోతుందని అన్నారు. శివరాత్రి ఉత్సవాలు ఈ గ్రామంలో జరుపుకున్నంత భక్తిశ్రద్ధలతో ఎక్కడ కనిపించదని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వి.మోహన్, బోయిడి విట్టల్, వడ్నం నాగేశ్వర్, రాందాస్, గ్రామస్తులు, భజన మండలి సభ్యులు ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.