25 August, 2026 | 12:06 AM

3 కోట్ల 50 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు

24-08-2026 10:51 PM

పనులను ప్రారంభించిన సర్పంచ్ కట్కూరి రాధిక, శ్రీనివాస్

గణపురం,(విజయక్రాంతి): 3 కోట్ల 50 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ధర్మారావుపేట రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి సోమవారం సర్పంచ్ కట్కూరి రాధిక  ప్రారంభించారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరయ్యాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్ పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ నరేష్, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ, గౌడ్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్,  మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, బత్తిని శివశంకర్ గౌడ్, దూలం కుమారస్వామి, గౌడ్ తిక్క సంపత్, తదితరులు పాల్గొన్నారు.