5 July, 2026 | 9:35 PM

సాత్విక్‌చిరాగ్ @ 1

22-05-2024 01:50 AM

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి బీడబ్యూఎఫ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ జంట ఐదు వారాల తర్వాత తిరిగి నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌కే పరిమితమైన సాత్విక్ జోడీ ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఆదివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలిచిన ఈ జంట రెండు స్థానాలు ఎగబాకి 99670 పాయింట్లతో టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 9వ ర్యాంక్‌లో నిలిచాడు