28 August, 2026 | 4:03 PM

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

28-08-2026 01:42 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) మహబూబాబాద్‌లోని తన స్వగృహంలో జర్నలిస్టు సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించే జర్నలిస్టుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి చిరుకానుకగా హెల్మెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు వారధిగా ఉంటూ నిత్యం వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటారని అన్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని తన వంతు బాధ్యతగా కొందరు జర్నలిస్టు మిత్రులకు హెల్మెట్లు అందిస్తున్నట్లు తెలిపారు.జర్నలిస్టుల భద్రతతో పాటు ప్రజల ప్రాణ రక్షణకు హెల్మెట్ వినియోగం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు పాల్గొన్నారు.