15-06-2025 12:52:55 AM
వనపర్తి టౌన్: నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో స్కాలర్స్ కళాశాల(Scholars College) విద్యార్థులు విజయ ఢంకా మ్రోగించి సంచలనం సృష్టించారు. శనివారం ప్రకటించిన నీట్ 2025 ప్రవేశ పరీక్షలో స్కాలర్స్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మెడికల్ సీట్లు సాధించారని నేడు ఒక ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. రెగ్యులర్ ఇంటర్ తో పాటు మొదటి ప్రయత్నంలోనే షాహిస్తా తహినియత్ 545 మార్కులు, కె. మహెందర్ 415 మార్కులు, టి. ప్రవంత్ రెడ్డి 393 మార్కులు జాతీయ ప్రవేశ పరీక్షలో సాధించారని తెలిపారు.
ఈ విద్యార్థులను స్కాలర్స్ కళాశాల యాజమాన్య సభ్యులు శాలువ మరియు పూలబొకే తో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులు, తాము చదివిన విద్యాసంస్థలకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో డా.పి.జగదీశ్వర్, డా.జి. వరప్రసాదరావు, డా.బి. నాగేశ్వర్ రెడ్డి, డా.ఎల్. సత్యనారాయణ రెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపాల్స్ ఎ.శ్రీధర్ , బి.మధుసూదన్ గుప్త మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.