15-06-2025 12:55:05 AM
నీట్ లో అద్భుత ఫలితాలను సాధించిన వాగ్దేవి కళాశాల..
విద్యార్థులను అభినందించిన కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): డాక్టర్ కావాలనుకుంటున్నారా... మీ లక్ష్యం నిజంగానే డాక్టర్ కావాలని తపన మీలో ఉంటే వాగ్దేవి కళాశాలను ఎంచుకోవాలని నీట్ లో ఫలితాలు సాధించిన విద్యార్థులు స్పష్టంగా చెబుతున్నారు. నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల(Vagdevi Junior College) విద్యార్థులు విజయ డంకా మోగించారని వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి(College Correspondent Vijetha Venkat Reddy) తెలియజేశారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందించారు వన్ క్లాస్ ప్రత్యేక ప్రోగ్రాంతో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ తో నాణ్యమైన విద్యను అందించి జాతీయస్థాయిలో మేము సైతం అంటూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సాధారణ విద్యార్థులు సైతం డాక్టర్లుగా మార్చిన ఘనత వాగ్దేవి అని ఇంతటి ఘనవిజయానికి అధ్యాపకుల సమిష్టి కృషి అని మట్టిలో మాణిక్యాలై ఆర్థికంగా వెనుకబడిన కొందరు నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తూ వారి జీవిత కల డాక్టర్ కావడాన్ని నిజం చేసిన ఘనత వాగ్దేవి జూనియర్ కళాశాలకు దక్కిందని తెలిపారు.
85 మంది విద్యార్థులలో 38 పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న విద్యాసంస్థ వాగ్దేవి జూనియర్ కళాశాల కావడం చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి నీట్ అకాడమీ ఇన్చార్జ్ పావని రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి నందన్ రెడ్డి, అకాడమీ అడ్వైజర్ యాకూబ్, ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్, ఎగ్జామినేషన్ ఇంచార్జ్ చెన్నయ్య, యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్, సతీష్ రెడ్డి నాగేందర్, రాఘవేంద్రరావు, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.