calender_icon.png 15 June, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటాలతోనే హక్కులు సాధిస్తాం

15-06-2025 12:52:44 AM

- ఎంపీ ఈటల రాజేందర్ 

- ఐఏఎస్ నరహరి రచించిన “బీసీల పోరుబాట” పుస్తకావిష్కరణ 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): పోరాటాలతోనే హక్కులు సాధించగలుగుతామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఐఏఎస్ నరహరి రచించిన “బీసీల పోరుబాట” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడారు.ఐఏఎస్, ఐపీఎస్‌గా ఉన్న, నాయకు డుగా ఏ పార్టీలో ఉన్నా, జడ్జిగా ఉన్నా అభిప్రాయాలను  ఒక పౌరుడిగా తెలియజేయ వచ్చని నరహరి నిరూపించారన్నారు. కుల సంఘాలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీగానే సా గుతున్నాయని చెప్పారు.

అన్ని పార్టీల ము ఖ్య నాయకులు ఒక వేదిక మీదకు రావడం, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే తపన కలి గి ఉండటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. అణిచివేతకు గురైన వారు మాత్రమే హక్కు లు కోరుతారు, సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు, వారే పుస్తకాలు రాస్తారు, ఉద్య మాలు చేస్తారని ఆయన వెల్లడించారు. రా జ్యం, రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనే దానిమీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉం టాయని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. సంకీర్ణ రాజకీయాలు ఉన్నటువంటి ఈ కాలంలో మోదీ ప్రధానమంత్రి అయ్యారని, దేశ చరిత్రలో 27 మంది ఓబీసీలను  మంత్రులను చేసిన ఘనత మోదీదే అన్నారు. పుస్తకాన్ని రచించిన నరహరి, వారి మిత్రులు పృథ్వీరాజ్ సింగ్‌లకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.