30-05-2025 03:03:07 AM
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును జూన్ 30వరకు పొడిగించారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుండగా దా న్ని మరో నెల రోజులు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు గురువారం సాంఘిక సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోని అర్హులైన విద్యార్థులు, కళాశాలల యాజ మాన్యాలు ఈ గడువులోగా వివరాలను ఈపాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ స్కాలర్షిప్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.