బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి
06-06-2026 04:08 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన గ్రామాల్లో బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించడంతోపాటు బడి మానేసిన పిల్లలను సైతం పాఠశాలలో చేర్పించాలని ఐటీడీఏ విద్యాశాఖ ఉప విద్యాధికారి గోడం చందన్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి ఉట్నూరు మండలాల్లో బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలను ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.






