11-06-2025 08:47:08 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapally Mandal) కొప్పురాయి పంచాయతీ పరిధిలో వడ్డుగూడెం అంగన్ వాడి కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడేళ్లు నిండిన పిల్లలను అంగన్ వాడి కేంద్రంలో చేర్పించాలని ప్రదర్శన నిర్వహిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో టేకులపల్లి ఐసిడీఎస్ సిడీపీఓ మంగతాయారు, సూపర్ వైజర్ ఖలీదా, అంగన్ వాడి టీచర్లు భద్రమ్మ, సీతకుమారి, రాధా, గ్రామ పెద్దలు, గర్భిణీలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.