11-06-2025 08:37:37 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) బుధవారం పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.