21-05-2025 12:26:49 AM
కంటి నిండా నిద్ర ఉండదు.. ఆటలు, విశ్రాంతి అసలే ఉండవు
* ఈ ఏడాది ఏప్రిల్ 24న నారాయణ ఘట్కేసర్ క్యాంపస్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జశ్వంత్ ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన కార ణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
2024 నవంబర్లో మియాపూర్ శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు..
ఈ రెండు ఘటనలు కేవలం మచ్చుకు మాత్రమే. ఈ తరహా ఘటనలు ప్రతీ ఏడాది నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో షరామామూలే అని ఆరోపణలున్నాయి.
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో చదివే విద్యార్థులపై చదువుల ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. వారు ఒత్తిడితో చిత్తవుతున్నారు. మార్కులు సరిగా రాలేదని, పరీక్షల్లో ఫెయిలయ్యావని, సరిగా చదవట్లేవని, నువ్వు చదవలేవని కళాశాలల్లోని కొందరు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల వేధింపులతో పలువురు విద్యార్థులు ఆత్మహ త్యలకు పాల్పడుతుంటే, మరికొందరేమో కన్నవారిని, ఇంటిని వదిలి ఉండలేక రకరకాల కారణాలతో అర్ధంతరంగా మధ్య లోనే తనువు చాలిస్తూ కన్నవారిని శోకసంద్రంలో ముంచుతున్నారు.
చదువుల కు నిలయాలుగా ఉండాల్సిన విద్యాలయాలు మృత్యువుకు నిలయాలుగా మారుతున్నాయన్న ఆరోపణులన్నాయి. మార్కులు, ర్యాంకుల వెంట విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు పరుగు లు పెట్టిస్తున్నాయి. విద్యార్థులను రోబోలుగా మార్చుతున్నాయి. ఉదయం నాలు గైదు గంటలకే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. దాదాపు రాత్రి పది, పదకొండు గంటల వరకు అది కొనసాగుతుంది.
లేచిన నుంచి నిద్రపోయే వరకు ఒత్తిడిని తట్టుకోలేక పలు వురు విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. 14 గంటల నుంచి 18 గంటల పాటు తరగతులు, స్టడీఅవర్స్, టెస్టుల పేరుతో మోయలేనంత భారం మోపుతున్నారు. వీకెండ్స్లో వీక్ ఆఫ్ ఎగ్జామ్స్ పేరిట మార్కుల గుదిబండ పెడుతున్నారు. ఇందులో మార్కులు తక్కువ వస్తే వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆదివారం కూడా స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఆటలుండవు.. విశ్రాంతి ఉండదు..
వినోద కార్యక్రమాలు అస్సలుండవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు విని వచ్చిన విద్యార్థులకు తిరిగి హాస్టళ్లలోనూ స్టడీ అవర్స్ అంటూ రాత్రంతా చదివిస్తున్నారు. పదో తరగతి వరకు ఇంటిపట్టున ఉంటూ చదువుకునే విద్యార్థులు ఒక్కసారిగా కన్నవారిని, అక్కడి వాతావరణానికి దూరంగా వచ్చేసి ఇక్కడ చదివేసరికి ఒత్తిడికి లోనవుతున్నారు.
నాలుగేళ్లలో చనిపోయింది 26 మందేనట!
కార్పొరేట్ చదువుల ఒత్తిడి భరించలేక తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డును వివరాలు అడిగింది. అయితే ఇంటర్ బోర్డు ఇచ్చిన వివరాలు, చనిపో యిన కారణాలను చూస్తే ఆశ్చర్యమేస్తోంది.
తెలంగాణ రాష్ర్టంలో 2020 నుంచి 2024 నవంబర్ వరకు వివిధ ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో కేవలం 26 మందే చనిపోయారని వివరాల్లో తెలిపింది. ఇందులో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు కూడా ఉన్నాయి. అదిలా బాద్లో 1, హనుమకొండలో 4, ఖమ్మంలో 2, సిద్దిపేటలో 2, సంగారెడ్డిలో 2, సూర్యాపేట 1, మహబూబ్న గర్ 2, రంగారెడ్డి 5, మేడ్చల్లో 7గురు ఉన్నట్లు తెలిపింది.
పరీక్షల సీజన్లలో దేశంలో ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతు న్నాయి. అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2022లో మొత్తం 1,70,924 ఆత్మహత్యలు నమోదు కాగా, వాటిలో 7.6 శాతం ఆత్మహ త్యలు విద్యార్థులవే ఉన్నాయి. వీటిలో పరీక్షల్లో ఫెయి ల్ అవుతామన్న భయంతో చేసుకున్న ఆత్మహత్యలు చేసుకున్నవారు 2,248 మంది.
తల్లిదండ్రులూ ఆలోచించాల్సిందే..
తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కాదు కదా అసలు వారికి భవిష్యత్తు లేకుండా పోతుందంటున్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఆదిశగా వారిని ప్రోత్సహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
8 నుంచి 10 గంటలు నిద్ర అవసరం..
ఇంటర్లో జాయిన్ అవుతున్న టీనేజర్లు ఆ వయసులో కీలకమైన అభివృద్ధి దశలో ఉంటారు. మెదడు, శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. వీరికి రోజు కు 8 గంటల నుంచి 10 గంటల వరకు నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. 14 నుంచి 18 గంటల వరకు రోజంతా చదువుతూ తక్కువగా నిద్రపోతే తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలకు టర్నింగ్ పాయింటే కావొచ్చు. కానీ దానిపేరుతో ఐఐటీ జేఈఈ, నీట్, ఎప్సెట్ లాంటి కోర్సుల పేరు తో విద్యార్థులపై లేనిపోని ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఆ కాలేజీలపై నియంత్రణ ఉండాలి
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో చదువొక్కటే ఉంటుంది. మార్కులు, ర్యాంకులే వారికి కావాలి. విద్యార్థులకు ప్రతి రోజూ 10 గంటల పాటు క్లాసులు నిర్వహిస్తారు. స్టడీ అవర్స్ అదనం. వారాంతపు పరీక్షలంటూ మార్కులు తక్కువొస్తే వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. సెలవు రోజుల్లోనూ చదివి స్తుంటారు. వీటిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలి. ఇష్టానుసారంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.
కే మణికంఠ రెడ్డి,
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
పిల్లల సమస్యలను తెలుసుకోవాలి
ర్యాంకులు, మార్కుల కోసమని శ్రీచైతన్య, నారాయణ కాలేజీ ల్లో తల్లిదండ్రులు పిల్లలను చేర్పిస్తున్నారు. వారం వారం పరీక్షలు పెట్టి మార్కులను ప్రకటిస్తున్నారు. మార్కులు రాని వారికి సరిగా చదవడంలేదని ఒత్తిడి చేస్తుంటారు. ఆ కాలేజీల్లో జైల్లో మాదిరిగా వాతావరణం ఉంటుంది. ఇలాంటి కాలే జీల్లో చేర్పించకపోవడమే మంచిది. పిల్లల సమస్యను తెలుసుకొని వారు ఏం చదువుతారో అడగాలి.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో చేర్పిం చాల్సి వస్తే హాస్టల్ వార్డెన్కు, కాలే జీ యాజమాన్యానికి డైలీ ఫోన్ చేసి పిల్లల గురించి అడగాలి. సరి గా నిద్రపోతున్నారా? క్లాస్లో నిద్రపోతున్నారా? ఏమైనా సమస్యలు న్నాయా? అని తెలుసుకోవాలి. సమస్యలుంటే వైద్యుడి వద్దకు కౌన్సిలింగ్కు తీసుకురావాలి.
డాక్టర్ ఆదిచైతన్య, సైకియాట్రిస్ట్