24-05-2025 10:55:13 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ఇటీవల విడుదల చేసిన టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్-2 తుది ఫలితాలలో జిల్లాకు చెందిన పలువురు ఎంపికయ్యారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన బత్తుల సత్తయ్య, విజయ దంపతుల కూతురు బత్తుల సౌమ్య 940 ర్యాంకుతో గ్రూపు-2 ఉద్యోగానికి ఎంపికయ్యింది. సౌమ్య బీటెక్ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగానికి ఎంపికవడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన గాజుల శ్రీనివాస్ సైతం ఎంపికయ్యారు. దీనితో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నాడు.