4 April, 2026 | 2:41 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

సీనియర్ న్యాయవాది శంకరన్న మృతి

01-12-2024 08:56 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, హక్కుల నాయకుడు చల్లా శంకర్ ఆదివారం హఠాన్మరణం చెందారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ట్యాబ్‌లెట్స్ కోసం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న మెడికల్ షాపునకు వెళ్ళి కళ్లు తిరుగుతుండడంతో వెంటనే ఆటోలో ఇంటికి చేరుకున్నాక కుప్పకూలి చనిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. శంకరన్నగా పేరుగాంచిన ఆయన విప్లవ, ప్రజా హక్కుల ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. జీవించినంత కాలం ప్రజా ఉద్యమాల పట్ల ప్రేమతో ముందుకు సాగారు. విప్లవ కార్యకర్తలకు ఆయన ఇల్లు నిలయంగా ఉండేది. ఆయన అకాల మృతికి సహచర న్యాయవాదులు సంతాపం తెలిపారు. శంకరన్న భౌతికకాయాన్ని బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, మేకల సుగుణారావు, బిచ్చాల తిరుమలరావు, బార్ అసోసియేషన్ నేతలు సందర్శించి, సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.