8 April, 2026 | 6:18 PM

జోనల్ స్థాయి పోటీలకు ఏడుగురు విద్యార్ధులు ఎంపిక

19-09-2025 08:03 PM

తలకొండపల్లి: మండల స్థాయి క్రీడాపోటీలలో ప్రతిభ కనబర్చి జోనల్ స్థాయి క్రీడాపోటీలకు ఏడుగురు విద్యార్ధులు ఎంపికయ్యరు. తలకొండపల్లి మండలం కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్ జి ఎఫ్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలలో మండలం లోని  వెల్జాల్ పాఠశాల విద్యార్థులు కబడ్డీ 14 సంవత్సారాల బాలుర విభాగంలో పవన్, శివశంకర్, మదు, పవన్ తేజ, 17 సంవత్సారాల బాలుర విభాగంలో రామకృష్ణ, వాలీబాల్ 14 సంవత్సారాల బాలుర విభాగంలో సాత్విక్, మారుతీలు ప్రతిభ కనబర్చి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పరమేశ్ తెలిపారు. ఎంపికైన విధ్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నసీం సుల్తానా, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు అభినందించారు.